‘ హనుమాన్ ‘ డైరెక్టర్ తో బాలయ్య వారసులు.. క్రేజీ కాంబోలో ఎన్ని ట్విస్టులో..?

నందమూరి బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎప్పటినుంచ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీకి.. అంత సిద్ధమైందని.. హనుమాన్ లాంటి సెన్సేషనల్ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో సినిమా తెరకెక్కించనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినిమాకు తన సోదరి బాలయ్య కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందట. మరో బ్యానర్‌ను యాడ్ చేస్తారా.. లేదా.. అనే దానిపై క్లారిటీ లేదు. తేజస్వినికి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.

ఎంపీ భరత్ భార్యగా, బాలయ్య కూతురిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని.. ఈసారి తన తమ్ముడి సినిమాతో ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా మారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని పట్టుదలతో ఉన్నారట. తండ్రి బాలయ్య వెంటే ఉంటూ మొత్తం అన్ని పరిశీలించిన ఈ అమ్మడు ఎలాగైనా తమ్ముడు సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలని చూస్తుందట. ప్రస్తుతం ఆషాడం నడుస్తున్న క్రమంలో ఈ మూడం పూర్తయిన వెంటనే సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ వైవిద్యమైన కథతో మోక్షజ్ఞ ఎంట్రీ అదిరిపోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మొదట తేజ స‌జ్జాతో రెండు సినిమాలు తీసి రెండు హిట్ల అందుకున్న ప్రశాంత్ వర్మ.. కొత్త హీరోలను అద్భుతంగా ప్రొజెక్ట్ చేస్తూ స్టార్ హీరోలుగా మార్చడంలో తన సత్తా చాటుతున్నాడు.

అందుకే మోక్షజ్ఞ ఎంట్రీకి ప్రశాంత్ వర్మ సరైన ఛాయిస్ అని బాలయ్య భావిస్తున్నాడట. సబ్జెక్టు విషయంలో ఇటీవల బాలయ్య మంచి పట్టు సాధించారు. దర్శకులు చెప్పిన దానికి తల ఊపేయకుండా.. తన అభిప్రాయాన్ని కూడా వెల్లడిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ, బాలయ్య కలిసి మోక్షజ్ఞ కోసం ఓ మంచి కథ సిద్ధం చేస్తారన‌టంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రశాంత్ వర్మ ద‌ర్శ‌క‌త్వం.. బాల‌య్య వార‌సుల సినిమా అంటే ఇది నిజంగా క్రేజి కాంబోనే. దీంతో ఈ ప్రాజెక్ట్ వ‌ర్కౌట్ అయితే మాత్రం ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.