ఇద్దరు స్టార్ హీరోలతో ఎఫైర్.. నిశ్చితార్థం తర్వాత మరోసారి బ్రేకప్.. ఈ అమ్మడిని గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో కొంతకాలం రిలేషన్లో ఉండి ఏవో కారణాలతో మనస్పర్ధలతో విడిపోయి.. బ్రేకప్ తర్వాత ఒంటరిగానే ఉండిపోయిన హీరో, హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. సల్మాన్ ఖాన్, టబూ, అమీషా పటేల్ లాంట‌టి బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా ఇలా బ్రేకప్ కారణంగా సింగిల్ గా మిగిలిపోయిన వారే. అయితే అలాంటి వారి కోవలోకి మన సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ బ్యూటీ కూడా వస్తుందని తెలుసా.. అయితే ఇద్దరు స్టార్ హీరోలతో రిలేషన్ షిప్ లో ఉన్న ఈ అమ్మడు.. తర్వాత నిశ్చితార్థం కూడా జరుపుకుంది. చివరకు అది కూడా బ్రేకప్ అవడంతో మ్యారీడ్ లైఫ్ పై విసుగుచెంది సింగిల్ గానే ఉండిపోయింది. దీంతో ఈ అమ్మడికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి.

కాగా ఇప్పుడు ఆమె దక్షిణాదిలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది. క్వీన్ ఆఫ్ సౌత్ గా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఆమె మరెవరో కాదు స్టార్ బ్యూటి త్రిష. ఈ అమ్మడుకి తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో అన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2010 అక్షయ్ కుమార్ హీరోగా తరికెక్కిన సూపర్ హిట్ మూవీ కట్ట మిట్ట తో హిందీ సీనీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత కిలాడి మూవీతో ప్రేక్షకుల ప్రశంసలను దక్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన అమ్మడు.. మళ్ళీ దక్షిణాదిలో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. గతంలో ఈమె లవ్ లో పడి మోసపోయింది అని.. ఇద్దరు స్టార్ హీరోలతో రిలేషన్స్ లో ఉందని వార్తలు వినిపించాయి.

ఇక ఆ తర్వాత గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఓ బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఏవో కారణాలతో ఇది కూడా బ్రేకప్ అయిపోయింది. ఈ క్ర‌మంలో విజయ్ దళపతి తో గ‌తంలో రిలేషన్షిప్ లో ఉందని.. ఆ కారణంతోనే ఆయన తన భార్య‌కు విడాకులు ఇచ్చి త్రిషని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై త్రిషతో పాటు విజయ్ ద‌ళపతి కూడా క్లారిటీ ఇచ్చారు. అవ‌ని తప్పుడు వార్తలని వివరించారు. అయినా నెటిజ‌న్స్ మాత్రం ఇలా రిలేషన్స్ కారణంగా విసుగు చెందడంతో.. ఆమె ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.