ప్రజెంట్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ నటించబోయే సినిమా. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా ..? అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు . ఆ మూమెంట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు . అయితే ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త సినీ వర్గాలలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది .
సినిమాలో నటించే హీరో హీరోయిన్లు మిగతా నటీనటులు టెక్నీషియన్స్ అందరికీ సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి . తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ హాట్ రన్ అవుతుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బాహుబలి సినిమాకి ఉపయోగించిన స్ట్రాటజీని ఈ సినిమాకి ఉపయోగించబోతున్నాడట రాజమౌళి . ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కబోతుందట .
అదే విధంగా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి . త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాబోతుందట . ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు కూడా జరిపారట . ఈ క్రమంలోనే ఈ న్యూస్ మీడియాకు లిక్ అయ్యి నెట్టింట వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కెరియర్ లోనే ఫస్ట్ టైం రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న సినిమా ఇదే కావడం గమనార్హం..!!