సినీ నటుడు మెగా హీరో నాగబాబు ఇటీవల పరోక్షంగా అల్లు అర్జున్ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. మా వాడైనా ప్రత్యర్ధుల కోసం పనిచేస్తున్నారంటే వాడు పరాయి వాడే.. పరాయి వాడైనా మా పక్కన నిలబడితే వాడు మా వాడే అంటూ ఆయన చేసిన ట్వీట్ నెటింట వైరల్ గా మారింది. అయితే ఈ ట్విట్ లో బన్నీ పేరును ఎక్కడ ప్రస్తావించకపోయినా.. అది బన్నీని ఉద్దేశించే చేసిన కామెంట్ అని అందరికీ అర్థమవుతుంది. ఇక అల్లు అర్జున్ జనసేన తరఫున సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
అయితే తన స్నేహితుడైన శిల్పా రవి కోసం మాత్రం స్వయంగా నంద్యాలకు వెళ్లి మరి ఎన్నికల ప్రచారం చేస్తూ మద్దతు పలికాడు. దీంతో తప్పనిసరిగా అల్లు అర్జున్ పై నాగబాబు ఇలాంటి కామెంట్స్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.. బన్నీ స్నేహితుడు శిల్పా రవి తాజాగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ నాగబాబు బన్నిని ఉద్దేశించి అలాంటి కామెంట్స్ చేశారో లేదో క్లియర్గా మనకు తెలియదు. కానీ ఒకవేళ అది బన్నీని ఉద్దేశించి చేసిన ట్విట్ అయితే మాత్రం దాన్ని ఆయన సంస్కారానికి.. విజ్ఞతకే వదిలేస్తున్నాను.
కేవలం బన్నీ స్నేహబంధంతోనే ఇక్కడికి వచ్చానని ఆల్రెడీ మీడియాతో కూడా చెప్పారు. అంతేకాదు ఓటింగ్ రోజు కూడా నాకు పార్టీలతో సంబంధం లేదు.. నా స్నేహితులు ఏ రంగంలో ఉన్న నేను వారికి సపోర్ట్ చేస్తా.. నాకు నచ్చితే వారి కోసం ఏదైనా చేస్తా.. అని క్లియర్ గా చెప్పాడంటూ శిల్పా రవి గుర్తు చేశాడు. అయినా నాగబాబు గారు బన్నీని ఉద్దేశించే ఈ పోస్ట్ చేసినట్లయితే.. ఆయన స్వభావం ఏంటో అర్థం చేసుకోవాలి. ఇక ఆయన చేసిన కామెంట్స్ ఆయన సంస్కారానికి వదిలేస్తున్న అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో శిల్పా రవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.