రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్.. వామ్మో ఈ బ్యూటీ అంటే పడి చచ్చిపోయే జనాలు చాలామంది ఉన్నారు . పుష్ప సినిమాతోనే అలాంటి ఓ అరుదైన ఘనత సాధించుకుంది అని చెప్పడంలో సందేహం లేదు సినిమాలపరంగా ఎంత బిజీగా ఉన్నా సరే రష్మిక మందన్నా..సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . తమ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూనే ఉంటుంది . తనకు తెలిసిన విషయాలను చెప్పుకొస్తూనే ఉంటుంది . తాజాగా ఒక పార్టీకి ప్రచారం చేస్తూ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
అభివృద్ధికి ఓటు వేయండి అంటూ ఆ వీడియోలో చెప్పుకు వచ్చింది రష్మిక మందన్నా. అయితే ఈ మధ్య ముంబైలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సముద్రపు వంతెన పై తన ప్రయాణాన్ని అనుభూతిని పంచుకుంటూ రష్మిక ఎలాంటి పోస్ట్ చేసిందో చూసాం .. రెండు గంటల ప్రయాణం 20 నిమిషాలలోనే పూర్తవుతుంది .. కానీ అసాధ్యం నీ సుసాధ్యం చేశారు మీరు అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది . ఇది కేవలం బ్రిడ్జ్ కాదు మన యువభారత్ కు గ్యారెంటీ అన్నారు.
అయితే దీనిపై ట్రోలింగ్ కూడా చేశారు జనాలు. తాజాగా రష్మిక షేర్ చేసిన వీడియో పై ప్రధాని మోదీ స్పందించారు. ఆయన రిప్లై ఇస్తూ ..”కచ్చితంగా ప్రజలను కనెక్ట్ చేయడం మరియు జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు “అంటూ రష్మిక మందన్నా పోస్టుకు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప గాడి భార్య అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు .. మరికొందరు నేషనల్ క్రష్ రష్మిక అక్కడ ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు..!!
Absolutely! Nothing more satisfying than connecting people and improving lives. https://t.co/GZ3gbLN2bb
— Narendra Modi (@narendramodi) May 16, 2024