సీనియర్ స్టార్ హీరోయిన్ మధుబాల కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొత్తం ఆరు భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. రోజా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ సినిమాతో భారీ పాపులాటి దక్కించుకున్న ఈ అమ్మడు.. తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు శ్రేయస్ తల్పాడేతో కర్తం భుగ్తం అనే మూవీలో నటించింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది.
అయితే గతేడాది తెలుగులో సమంత నటించిన శకుంతలంలో ఓ కీలకపాత్రలో నటించి మెపించింది మధుబాల. అలాగే కంగనా రనౌత్ తలైవీ సినిమాలోను ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇటీవల ఓ ఈవెంట్లో మధుబాలా మాట్లాడుతూ.. అప్పుడు లొకేషన్స్ లో పరిస్థితులు ఎలా ఉండేవో వివరించింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు లేడీస్ కు చాలా సౌకర్యాలు మెరుగుపడ్డాయని.. ఎర్ర గుహలలో, కొలాచీలో తమిళ్ సినిమాల షూటింగ్ చేస్తున్న సమయంలో ఆరు బయట బట్టలు మార్చుకోవాల్సి వచ్చేదని.. ఆ టైంలో ఎవరు చూస్తున్నారో తెలియక చాలా ఇబ్బంది పడేదాని.. బట్టలు మార్చుకోవడానికి పడే తంటాలు అన్ని ఇన్ని కావంటూ వివరించింది.
కొండ ప్రాంతాలు, పెద్ద చెట్లు కిందనే బాత్రూమ్స్ లాగా భావించి అక్కడే డ్రెస్సెస్ చేంజ్ చేసుకునే వాళ్ళమని.. ఇరువర్ షూటింగ్ టైం లో తమిళనాడులో మారుమూల ప్రదేశంలో షూటింగ్ జరుగుతుంటే.. అక్కడ రెస్ట్ తీసుకునేందుకు ప్లేస్ లేక రాళ్లపై పడుకుని నిద్రించానని వివరించింది మధుబాల. ఇప్పుడు అసలు ఇబ్బంది లేదు. మనకు మేకప్ వేసుకోవాలంటే ఓ వ్యాన్ కావాలని అడగొచ్చు. గోప్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు అంత డబ్బు సంపాదించిన ఉపయోగముండేది కాదు. రాళ్లపై పడుకోవాల్సి వచ్చేది. ఇక లేడీ ఆర్టిస్టులు ఆ రోజుల్లో పడ్డ ఇబ్బందులు అయితే అన్నీ ఇన్ని కాదు అంటూ వివరించింది. మధుబాల చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.