టాలీవుడ్ డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఇటీవల తిరిగి సెట్స్లో పాల్గొన్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తికేయ హీరోగా నటించిన భజే వాయువేగం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేశాడు డైరెక్టర్ సుజిత్.
ఇందులో కార్తికేయతో చిట్ చాట్ చేసిన సూజిత్ ఓజి అప్డేట్స్ అందించడంతోపాటు.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోలుగా మల్టీ స్టారర్ అంటే ఫ్యాన్స్ లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వినడానికే ఓ సెన్సేషన్. అలాంటి ఇండస్ట్రీని షేక్ చేస్తే ఈ కాంబోలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించాలని అనుకుంటున్నాడట సుజిత్. ఇటీవల ఈ విషయాన్ని భజే వాయువేగం మూవీ ప్రమోషన్స్ లో వివరించాడు.
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో కలిపి ఓ మల్టీ స్టారర్ చేయాలనేది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తన ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుంది.. ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది.. అసలు సాధ్యమవుతుందా.. అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సుజిత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవడంతో ఫాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నిజంగానే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా అంటూ.. రికార్డ్ల వర్షం కురిపిస్తుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.