ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్న విషయం తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా తన లైఫ్ను తనకు నచ్చిన విధంగా ముందుకు తీసుకెళుతుంది నిహారిక కొనిదెల . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో సొంతంగా ఓ బ్యానర్ను స్టార్ట్ చేసి పలు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే ఈ బ్యానర్ పై చేయడానికి సిద్ధపడింది .
అయితే ఫస్ట్ టైం నిహారిక కొనిదెల కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో మన ముందుకు రాబోతుంది . యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే విధంగా ఓ మూవీకి కమిట్ అయింది నిహారిక . “కమిటీ కుర్రాళ్ళు” అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతుంది . ఈ సినిమాను యాదవ్ వంశీ దర్శకత్వం వహిస్తున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో 11 మంది హీరోలు నలుగురు హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుందట నిహారిక అంటూ ఓ న్యుస్ బాగా బాగా వైరల్ గా మారింది.
నిహారిక విడాకుల తర్వాత ఫుల్ రేంజ్ లో రెచ్చిపోతుంది అంటూ ఆమె ఫోటోషూట్స్ చూస్తేనే తెలుస్తుంది . అయితే ఇలా నిహారిక కొత్త కొత్త కాన్సెప్ట్లను తెరకెక్కించడానికి సిద్ధపడటంతో లిమిట్స్ క్రాస్ చేసేస్తుంది . తేడా కొడితే కష్టమే కంట్రోల్ నిహారిక అంటూ కొందరు సజెస్ట్ చేస్తున్నారు . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!