‘ క‌ర‌ణం బ‌ల‌రాం ‘ కు ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి… పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభం కార్డేనా…!

సీనియ‌ర్ రాజ‌కీయ నేత, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంకేనా.. ఆయ‌న కొడుకు క‌ర‌ణం వెంక‌టేష్ పొలిటిక‌ల్ కెరీర్‌కు కూడా శుభం కార్డు ప‌డ‌బోతోందా ? ఇప్పుడు ఇదే చ‌ర్చ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో గ‌ట్టిగా న‌డుస్తోంది. చంద్ర‌బాబులా 40 ఏళ్ల హిస్ట‌రీ అని చెప్పుకుంటూ కాలం గ‌డుపుకుంటూ వ‌స్తోన్న బ‌ల‌రాంకు వార‌సుడు వెంక‌టేష్ విష‌యంలో ఎంతో ఆవేద‌న ఉంది. ఇది ఆయ‌న ఎవ్వ‌రికి చెప్పుకోలేక‌పోతున్నారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు అద్దంకిలో బ‌ల‌రాం, ఆయ‌న త‌న‌యుడు వెంక‌టేష్ ఇద్ద‌రూ ఓడిపోయారు.

అప్పుడే రాజ‌కీయంగా క‌ర‌ణం ఫ్యామిలీ ప‌నైపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో అనూహ్యంగా చివ‌ర్లో చీరాల సీటు ద‌క్కించుకున్న బ‌ల‌రాం అక్క‌డ స‌మీక‌ర‌ణ‌లు, ప్ర‌త్యేక ప‌రిస్థితుల‌తో గెలిచారు. ఆ వెంట‌నే త‌న‌కు సీటు ఇచ్చిన క‌న్న‌త‌ల్లి లాంటి టీడీపీ, చంద్ర‌బాబు గుండెల మీద త‌న్ని మ‌ళ్లీ అధికారం కోసం వైసీపీ చెంత‌చేరారు. ఇంత చేసినా చీరాల‌లో ఆయ‌న‌కు ప‌ట్టులేదు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఇండిపెండెట్ ఫ్యానెల్‌ను నిల‌బెట్టిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి బ‌ల‌రాం నిల‌బెట్టిన వైసీపీ క్యాండెట్స్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారంటే బ‌ల‌రాంకుం ఎంత బ‌ల‌ముందో తెలుస్తోంది.

చీరాల‌లో ఎన్నిక‌ల త‌ర్వాత ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ ఓడినా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా దూసుకెళుతూ వైసీపీని ప‌టిష్టం చేసుకొస్తున్న క్ర‌మంలోనే బ‌ల‌రాం వైసీపీ చెంత చేర‌డంతో చీరాల వైసీపీ క‌ర‌ణం ఎఫెక్ట్‌తో కుక్క‌లు చింపిన విస్త‌ర్లా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల‌రాం గెలుపు కోసం ప‌నిచేసిన వారిలో ఒక్క‌రు కూడా ఇప్పుడు ఆయ‌న వెన‌క లేరు. బ‌ల‌రాం పేరుకు మాత్ర‌మే వైసీపీలో ఉన్నా ఆయ‌న కాని, ఆయ‌న త‌న‌యుడు కాని ఏనాడు చంద్ర‌బాబు, టీడీపీపై విమ‌ర్శ‌లు చేయ‌రంటే చేయ‌రు. ఇంకా చెప్పాలంటే అస‌లు బ‌ల‌రాం, వెంక‌టేష్ ప్రెస్‌మీట్లు పెట్టారంటే గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిన‌ట్టే లెక్క‌.

తాజాగా చంద్ర‌బాబు ఇంకొల్లు స‌భ‌లో త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా బ‌ల‌రాం పెట్టిన ప్రెస్‌మీట్ కూడా త‌లాతోకా లేకుండా ఊక‌దంపుడు మాదిరిగా ఉందే త‌ప్పా అదో స్ట్రాంగ్ కౌంట‌ర్ అని ఎవ్వ‌రూ అనుకోవ‌ట్లేదు. ఏదో వైసీపీ వాళ్ల‌ను న‌మ్మించాలి కాబ‌ట్టే ఓ ఉత్తుత్తి ప్రెస్‌మీట్ పెట్టేసి చేతులు దులిపేసుకున్నార‌నే అంటున్నారు. అస‌లు బాలినేని వాసు అండ లేక‌పోతే బ‌ల‌రాంను జ‌గ‌న్ ఏనాడో ప‌క్క‌న పెట్టేసి ఉండేవారని జిల్లా వైసీపీ టాక్ ?

వైసీపీలో చేరినా బ‌ల‌రాంకు ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ అవుతోంది. అస‌లు బాలినేని శ్రీనివాస్ లాంటోళ్ల‌కే క‌క్క‌లేక మింగ‌లేని పరిస్థితి ఉంది. ఇక బ‌ల‌రాం చెప్పిన‌ట్టు జ‌గ‌న్ వింటాడ‌నేది పూర్తి హాస్యాస్ప‌దం. వైసీపీలో ఉన్నా చివ‌ర్లో అయినా చీరాల సీటు వ‌స్తుందా ? అంటే డౌటే. జ‌గ‌న్ మ‌హామ‌హుల‌ను సింపుల్గా సైడ్ చేసేస్తున్నాడు. లేక‌పోతే తాను చెప్పిన చోట‌కు వెళ్లి పోటీ చేయాల‌ని చెపుతున్నాడు. దీంతో ఇప్పుడు క‌ర‌ణం తండ్రి, కొడుకుల‌కు కూడా టెన్ష‌న్ స్టార్ట్ అయ్యిందంటున్నారు.

అటు టీడీపీ వైపు ప‌రిచ‌యాలు, స్నేహాలు అలాగే కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు. అయితే జిల్లా టీడీపీ లీడ‌ర్ల‌తో పాటు చంద్ర‌బాబు అస్స‌ల‌స్స‌లు ఒప్పుకోలేద‌ట‌. ఈ కోపంతోనే చంద్ర‌బాబు మోస‌గాడు, ప‌చ్చి అబ‌ద్ధాల కోరు అంటూ బ‌ల‌రాం పైపైన విమ‌ర్శ‌లు ( వైసీపీలో ప‌రిస్థితి బాగోలేక భ‌విష్య‌త్తులో బాబు అవ‌స‌రం ఉంటుందేమో అని) చేసి స‌రిపెట్టారు. ఏదేమైనా క‌ర‌ణం పొలిటిక‌ల్ క‌ప్ప‌దాట్ల దెబ్బ‌కు ఆ ఫ్యామిలీకి క‌నుచూపు మేర‌లో కూడా పొలిటిక‌ల్ కెరీర్ ఉండేలా లేదు.