టాలీవుడ్ స్టార్ సింగర్ బిగ్బాస్ మాజి కంటిస్టెంట్ గీత మాధురి, నటుడు నందు.. ఈ జంటకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2014లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2019లో దాక్షాయిని అనే ఓ పాపకు జన్మనిచ్చారు. ఇక ఈ మధ్యన ఈ జంట విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. వాటిని చెక్ పెడుతూ ఇటీవల మరోసారి గీతామాధురి తల్లి కాబోతుంది అంటూ అనౌన్స్ చేసింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఈ ముద్దుగుమ్మ మదర్ హుడ్ లోని ఫీల్ ఎంజాయ్ చేస్తుంది.
గీత దంపతులకు ఇదివరకే దాక్షాయిని అన్న పాప ఉంది. తాను రెండోసారి గర్భం ధరించినట్లు డిసెంబర్లో చెప్పుకొచ్చిన గీత.. ఫిబ్రవరిలో దాక్షాయినికి తోడుగా మరో బుజ్జి పాప రానుంది అంటూ వివరించింది. ఈ నెలలో గీత పండంటి బిడ్డను ప్రశ్నించనుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న గీత మాధురి.. తాజాగా సీమంత వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఈ ఫంక్షన్ లో గీత స్నేహితులు, సన్నిహితులతో పాటు భర్తనందు కూడా సందడి చేశాడు.
ఈ ఈవెంట్లో ఆకుపచ్చ నారింజరంగు కాంబినేషన్లో ఉన్న చీరలో మెరిసింది గీత. ఇక వేదిక కూడా రకరకాల పూలతో అందంగా డెకరేట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఎంతమంది సెలబ్రిటీస్, అలాగే ఫ్యాన్స్, నెటిజెన్లు గీతామాధురికి మళ్ళీ పండంటి బిడ్డ పుట్టాలని.. ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని తమ విషెస్ తెలియజేస్తున్నారు.