ఆ హీరోయిన్ మరణం..సదాకు అంతలా కలిసొచ్చిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదైనా జరగొచ్చు. ఇది జరుగుతుంది అని ఎవ్వరూ చెప్పలేం . అలాగే హీరోయిన్ సదా లైఫ్ లో జరిగే ఆమె కెరియర్నే మార్చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి జయం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమాతో సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత అపరిచితుడులో కూడా నటించే ఛాన్స్ అందుకుంది. అయితే జయం సినిమాలో ముందుగా హీరోయిన్గా అప్పటి సెన్సేషన్ హీరోయిన్ ప్రత్యూషను అనుకున్నారట తేజ.

ఆమెనే ఈ రోల్ కి బాగుంటుంది అంటూ చూస్ చేసుకున్నారట . కానీ అనుకోని కారణాల చేత ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఆమె ప్లేస్ లోకి హీరోయిన్ సదాను తీసుకొచ్చారు . ఒకవేళ ప్రత్యూష చనిపోకపోయి ఉంటే కచ్చితంగా.. ఆ ప్లేస్లో ప్రత్యూషనే పెట్టుండేవాళ్ళు . సినిమా మరింత స్థాయిలో హిట్ అవ్వడమే కాకుండా ఆమె కెరియర్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉండేది .

బ్యాడ్ లక్ ఆ ప్లేస్ లోకి సదా వచ్చి ఆ లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది. జయం సినిమా తరువాత ఆమె రేంజ్ నే మారిపోయింది. అంతేకాదు..ఆమెకు ఎన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ప్రజెంట్ పలు షో లకు జడ్జీగా వ్యవహరిస్తుంది. ఒక్కవేళ్ల ప్రత్యూష బ్రతికి ఉంటే ఆ ఛాన్స్ ఈమెకు వచ్చుండేది కాదేమో..?