వామ్మో ఇది నిజంగా బిగ్ బాస్ అభిమానులకు ఊహించని షాక్ అనే చెప్పాలి . ఏంటి ఎప్పుడు లేని విధంగా టిఆర్పిసి తీసుకొచ్చే ఓ టాప్ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ ఈసారి ఎలిమినేట్ చేసేసింది. ప్రెసెంట్ ఇలాంటి షాకింగ్ కామెంట్స్ తోనే ఆశ్చర్యపోతున్నారు జనాలు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత రసవత్తరంగా ముందుకు వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా అవసరం ఉన్నా.. లేకపోయినా అరిచి గగ్గోలు పెట్టి ఏడ్చి పెడబొబ్బలు పెట్టే కంటెస్టెంట్ లు ఈసారి కూసింత ఎక్కువ మందే ఉన్నారు .
అయితే మొదటినుంచి ఇంట్లో అన్ని యాక్టివిటీస్ లో చలాకీగా పాల్గొంటున్న ఓ టాప్ కంటెస్టెంట్ ని ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేట్ చేసినట్లు వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సందీప్ -శోభ శెట్టి టాప్ టు డేంజర్ స్దానం లో ఉన్నారు . అయితే ఇంట్లోని హౌస్ మేట్స్ ఓటింగ్ తీసుకున్న నాగార్జున శోభాశెట్టిని సేఫ్ చేస్తూ సందీప్ ని ఎలిమినేట్ చేశారట .
ప్రజెంట్ ఇదే వార్త వైరల్ అవుతుంది. దీంతో సందీప్ కు సపోర్ట్ చేసిన జనాలు షాక్ అయిపోతున్నారు. సందీప్ ఆట బాగా ఆడతాడు.. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది . మరి ఎందుకు ఆయనని ఎలిమినేట్ చేశారు . ఓట్లు తక్కువ వచ్చాయంటే మేము నమ్మం ..అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు సందీప్ హౌస్ లో ఉండడం వల్ల బిగ్ బాస్ కి చాలా బెనిఫిట్స్ టి ఆర్ పి లు కూడా బాగా వస్తాయి . మరి ఎందుకు ఆయన్ని ఎలిమినేట్ చేశారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది . చూద్దాం ఏం జరుగుతుందో..?