సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో మిస్ బిహేవ్ చేయడం వాడుకొని వదిలేయడం సర్వసాధారణం . చాలామంది అలాంటి హీరోయిన్స్ ని మనం చూస్తుంటాం . కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్ ..సినిమాలో కూడా సీన్స్ పరంగా ఓ రొమాంటిక్ ఓ సీన్ చేయడానికి డైరెక్టర్స్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. అంతేకాదు సినిమా రిలీజ్ అయి కొన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికి ఆ సీన్ చూస్తే కంపరంగా అనిపిస్తూ ఉంటుందట . ఆ హీరోయిన్ మరెవరో కాదు సదా .
జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సదా ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ స్థానాన్ని అందుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం టఫ్ కాంపిటీషన్స్ మధ్య గట్టిగా ట్రై చేస్తున్న సదా .. ఇంకా క్లిక్ అవ్వలేదు ..ఇలాంటి క్రమంలోనే సదకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. జయం సినిమాలో హీరో నితిన్ విలన్ గోపీచంద్ మధ్య నలిగిపోతుంది ఈ అమ్మడు .
కాగా నితిన్ కలుసుకోవడానికి ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ లో ఆమె గుడిలో ప్రదిక్షణలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరికి తెలియకుండా నితిన్ కలుసుకుంటుంది . కాగా ఆ విషయాన్ని కనిపెట్టేసిన గోపీచంద్ ముందుగానే అక్కడికి చేరుకొని వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు . ఆ టైంలో గోపీచంద్ సదా ను తన నాలికతో చెంపపై నాకుతాడు. అయితే ఈ సీన్ నేను చేయను అంటే చెయ్యను వద్దురా బాబోయ్ కావాలంటే.. సినిమాలో నుంచి తీసేయండి అంటూ చెప్పుకొచ్చిందట .
కానీ డైరెక్టర్ తేజ మాత్రం అస్సలు వినలేదట . నువ్వు ఈ సీన్ చేయాలంటే చేయాల్సిందే అంతే తప్పదు అంటూ బలవంతం చేశారట . ఆఖరికి గోపీచంద్ కూడా వద్దులేండి సార్ అన్న కూడా గోపీచంద్ పైనే ఫైర్ అయ్యారట. ఫైనల్లీ అక్కడ ఉండేవారు సర్ధి చెప్పడంతో అయిష్టంగానే సదా ఆ సీన్ కి ఒప్పుకునేందట. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఏకంగా 10 సార్లు తన ఫేస్ వాష్ చేసుకుని ఇంటికి వెళ్లి ఎన్నోసార్లు ఏడ్చిందట. ఇప్పటికీ టీవీలో ఆ సీన్ చూసిన ఎక్కడైనా ఈ సీన్ గురించి క్లిప్స్ కనిపించిన ఆమె ఫీల్ అవుతుందట.