ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ సీక్రెట్ గా తన ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకుందా..? అంటే అవును అని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు. దానికి కారణం లేకపోనూ లేదు . ఇన్నాళ్లు తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పెహరియా తో చట్టపట్టలేసుకొని తిరిగిన ఈ బ్యూటీ రీసెంట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
అంతేకాదు పట్టు వస్త్రాలలో జంటగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పెహరియాతో దేవుని దర్శించుకోవడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ఇదే క్రమంలో ఆమె చేతికి ఉన్న డైమండ్ రింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శిఖర్ పెహరియాతో – జాన్వి కపూర్ ఎంగేజ్మెంట్ అయిపోయిందని ..ఆ కారణంగానే దేవుని దర్శించుకోవడానికి ఇద్దరు జంటగా వచ్చారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
శ్రీదేవి ఏ మంచి పని చేసిన ముందు దేవుడు సన్నిధికి వచ్చి దండం పెట్టుకొని.. ఆ విషయాన్ని బయటపడుతుంది. అదేవిధంగా జాన్వి కపూర్ సైతం తన సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె దేవుడికి చెప్పిన తర్వాతే బయటపడుతుంది . ఇప్పుడు కూడా శ్రీదేవి కూతురు జాన్వికపూర్ తన ఎంగేజ్మెంట్ విషయాన్ని ముందు దేవుడికి చెప్పి ఆ తర్వాతే అభిమానులకు చెప్పబోతుందేమో ..? అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే జాన్వికపూర్ ఎంగేజ్మెంట్ అనేది ఓ పెద్ద పండుగ లాంటిది.. వాళ్ళ ఫ్యాన్స్ కి చెప్పకుండ ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసేసాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఆఫీషియల్ ప్రకటన రాలేదు. చూద్దాం మరి ఇది నిజమో..? లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకారో..? అయితే జాన్వి చేతికి ఉన్న డైమండ్ రింగ్ గురించి బోనీ కపూర్ ఏం చెప్తాడో వేచి చూడాలి..!!