మళ్లీ టాలీవుడ్ వైపు మక్కువ చూపుతున్న స్టార్ హీరోయిన్..!!

గతంలో మోడల్ గా పనిచేసిన హీరోయిన్ కృతి సనన్ సుకుమార్, మహేష్ కాంబినేషన్లో వచ్చిన నేనొక్కడినే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితము అయ్యింది.. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా సూపర్ క్రేజ్ ను అందుకుంది.ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈమెకు టాలీవుడ్ కలిసి రాలేదని బాలీవుడ్ లోని పలు సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరుపొందింది.

At Adipurush Trailer Launch, Kriti Sanon Sits on Floor Due to THIS Reason;  Video Goes Viral

బాలీవుడ్ లో కూడా మొదట ఫ్లాపులు పడిన ఫైనల్ గా ఈ ఆమ్మడు స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. తాజాగా ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది కృతి సనన్.. ఈ సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆది పురుష్ సినిమా ప్రమోషన్స్లో యాక్టివ్గానే ఉన్న తెలుగులో అవకాశం వస్తే మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నానంటూ తెలియజేస్తోంది. హిందీలో మంచి ఫామ్ లో ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్ సినిమాలలో కూడా నటించి పాన్ ఇండియాలే వాళ్ళు సక్సెస్ కావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

साड़ी में गजब की दिखीं Kriti Sanon, दे रही हैं फैशन गोल्स!

కృతి కూడా తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలియడంతో అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఒకవేళ ఆది పురుష్ చిత్రం సక్సెస్ అయ్యిందంటే ఈమె ఫేట్ మారిపోతుందని చెప్పవచ్చు రామాయణం కథ అంశంతో ఆది పురుషు సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ స్క్రీన్ లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు.