అతి చేస్తున్న సంయుక్త మీనన్.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..? బొక్క బోర్లా పడాల్సిందేనా..?

ఎస్ .. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో ..ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మలయాళ బ్యూటీగా తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయిన సంయుక్త మీనన్ ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పట్టిందల్లా బంగారమే అన్నట్టు అమ్మడు సైన్ చేసిన సినిమా ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంటుంది . ఈ క్రమంలోనే సంయుక్త పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఇదే టైంలో పలు షోస్ కి ఈవెంట్స్ కి అటెండ్ అవుతున్న సంయుక్త పరసనల్ లైఫ్ విషయాలను కూడా వైరల్ చేస్తుంది . ఈ క్రమంలోనే సంయుక్త తన పారితోషకం కూడా పెంచేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . మరీ ముఖ్యంగా అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన భీంలా నాయక్ సినిమాకి 70 లక్షల పారితోషకంగా తీసుకుంటే ..రీసెంట్గా చేసిన విరుపాక్ష సినిమాకి రెండు కోట్లు పారితోషకం అందుకుందట .

అంతేనా తాను నెక్స్ట్ చేయబోయే సినిమాలకు ఏకంగా నాలుగు కోట్లు పారితోషకం డిమాండ్ చేస్తుందట. దీంతో మేకర్స్ సైతం షాక్ అయిపోయారు . ఈ క్రమంలోనే సంయుక్త ఇలాంటి అతి ఓవరాక్షన్స్ ఎక్కువ చేసే ఉన్న పరువు కూడా పోతుందని ..ఇక ఆమెకు అవకాశాలు కూడా ఇవ్వరని ..సో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అని ..లేకపోతే బొక్క బోర్లా పడాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు. ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల డిమాండ్ చేస్తుంది అంటే కొంచెం ఓవర్ అని అంటున్నారు జనాలు . చూద్దాం మరి సంయుక్త దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో..?