ఫైనల్లీ..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత..డబుల్ ధమాకా అంటే ఇదేగా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. త్వరలోనే శాకుంతలం సినిమా తో జనాలను పలకరించనుంది . టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు . అయితే పఠాన్ సినిమా ఇచ్చిన భారీ షాక్ తో పలు సినిమాలు తమ సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకోవడంతో .. సమంత సినిమా రిలీజ్ డేట్ మార్చి 27 కు పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఈ క్రమంలోనే టైం వేస్ట్ చేయకుండా సమంత .. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెడుతుంది . బాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడిల్ వెబ్ సిరీస్ షూట్లో పాల్గొనింది . అంతేకాదు త్వరలోనే శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఖుషి సినిమా షూట్లోను పాల్గొనబోతుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేసింది సమంత.

కాగా ఇన్నాళ్లు సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడిపోతుందని.. ఇకపై సినిమాలో నటించదని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . వాటికి పరోక్షకంగా కౌంటర్ వేస్తూ సినిమాలకు నేను రెడీ అంటూ చెప్పకనే చెప్పేసిన సమంత .. రీసెంట్గా సమంతనే పూర్తిగా కోల్కున్నాను అంటూ అఫీషియల్ నోట్ చేసింది . ఈ క్రమంలోనే సమంత చేసిన ఇన్ స్టా పోస్ట్ వైరల్ గా మారింది . సమంత తన ఇంస్టాగ్రామ్ లో రాసుకుంటూ .. “ఒక దశలో నన్ను నేను కోల్పోయానని బాధపడిపోయాను .. మనోధైర్యంతో అన్నిటిని ఎదిరించి సవాళ్ల్ను ఎదుర్కొన్నాను”..అంటూ మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుంటున్నట్లు అంటూ చెప్పకనే చెప్పేసింది సమంత . ఈ తరుణంలోని ఫాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు..!!