సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా జనాలు చేత శభాష్ అనిపించుకుని.. జనాల మదిలో ప్లేస్ దక్కించుకునే ముద్దుగుమ్మలు చాలా తక్కువ . అదే లిస్టులో మొదటి ప్లేస్ లో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ సమంత. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న సమంత ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే . మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న సమంత ..ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటూ కాలం గడుపుతుంది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే సమంత తన నెక్స్ట్ సినిమా షెడ్యూల్లో భాగం కానున్నట్లు తెలుస్తుంది.
మనకు తెలిసిందే సమంత , టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో శివనిర్వాణ డైరెక్షన్లో ఖుషీ అనే సినిమాను చేస్తుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. రెండో షెడ్యూల్ ని ఎప్పుడో పూర్తి చేసుకొని ఉండాల్సింది. కానీ సమంత హెల్త్ బాగోలేని కారణంగా డైరెక్టర్ పెద్ద మనసు చేసుకొని సినిమా షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేశారు . అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 3వ వారంలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది . కాగా రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులతో ముచుట్టించింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సమంత ఇలా అభిమానులతో ముచ్చటంచేసరికి భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను ప్రశ్నించారు.
సమంత ని ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ ..” మీరు మీ హెల్త్ త్వరగా సెట్ చేసుకొని పూర్తి ఆరోగ్యవంతురాలుగా ఇండస్ట్రీలో మళ్ళీ సినిమాలు చేయాలి.. మీ పై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలి “అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి సమంతా రిప్లై ఇస్తూ..” మీ బ్లెస్సింగ్స్ మీ అభిమానం నాతో ఉంటే నేను త్వరగా కోలుకుంటాను ..నాపై ఆరోపణల ఏంటవి..?” అంటూ ఏమీ తెలియనట్టే అడిగింది.
ఈ క్రమంలోనే సమంత ఫ్యాన్స్ ..సమంత ఎలాంటి తప్పు చేయలేదని సోషల్ మీడియాలో వచ్చేవి అన్నీ తప్పుడు వార్తలేనని.. సమంత అందుకే ఇలా కామెంట్ పెట్టింది అంటున్నారు . అంతేకాదు గతంలో సమంత రెండో పెళ్లిపై.. సమంత ప్రెగ్నెనెసీ పై ఎన్నో రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సమంత వేరే హీరో కోసం నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందన్న వార్త కూడా వైరల్ అయ్యింది. అప్పుడే ఆమె ఫ్యాన్స్ దమ్ముంటే అది ప్రూఫ్ చేయండి అంటూ కూడా సోషల్ మీడియాలో సవాలు విసిరారు. ఏది ఏమైనా సరే చాలా రోజుల తర్వాత సమంత అభిమానులతో మాట్లాడటం ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహం ఇస్తుంది..!!