ఇటీవల వరుస ప్రమాద ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం సంచలనమైన విషయం తెలిసిందే. బాబు ప్రచార పిచ్చి వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంది. పోలీసుల సెక్యూరిటీ కావల్సిన విధంగా లేకపోవడం, ఇందులో ఏదో కుట్ర కోణం ఉండటం వల్లే 11 మంది చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది.
ఇక ఏది ఎలా జరిగినా ఆ ఘటనల వల్ల జగన్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది..ఇకపై ఏ రోడ్లు అయినా సరే ర్యాలీలు, సభలు పెట్టడానికి లేదని, పోలీసులు అనుమతి ఇచ్చిన ప్రదేశాల్లోనే సభలు పెట్టాలని రూల్ పాస్ చేశారు. అయితే ఈ రూల్ పెట్టిన కొద్ది గంటల్లోనే రాజమండ్రికి వెళ్ళిన జగన్..రోడ్ షో నిర్వహించడం గమనార్హం. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. కేవలం ప్రతిపక్షాలని అణిచివేయడానికే ఆ జీవో తీసుకొచ్చారని, ఈ జీవో అధికార పార్టీ వాళ్ళకు వర్తించదా అంటూ ఫైర్ అవుతున్నారు.
అయితే ఇటీవల చంద్రబాబు రోడ్ షోలకు జనం భారీగానే వస్తున్నారు. ఇక జనవరి 27న నుంచి లోకేష్ పాదయాత్ర ఉంది..అటు పవన్ బస్సు యాత్ర ఉంది. ఈ రెండు రోడ్లపై జరగాల్సిందే. ఇలా ప్రతిపక్షాల కార్యక్రమాలు ఉండటంతోనే జగన్ ప్రభుత్వం కావాలని..చీకటి జీవో తెచ్చి ప్రతిపక్షాలని అడ్డుకోవాలని చూస్తుందని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే నేడు చంద్రబాబు..కుప్పం వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు.
ముందుగా అనుకున్నట్లు రోడ్ షోలు ఉన్నాయి..కానీ ఇప్పుడు పోలీసుల ఆంక్షలతో రోడ్ షోలు ఉండవని తెలుస్తోంది. ఇక ఖాళీ ప్రదేశంలోనే సభ పెట్టుకోవాలని చెప్పి పోలీసులు ఆంక్షలు పెట్టారు. మరి కుప్పం టూర్ ఎలా జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.