అప్పుడు తమ్ముడిని తిట్టారు.. ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రవితేజకు సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వాల్తేరు వీరయ్య'లో రవితేజ అంతసేపు ఉంటాడా.. అయితే పూనకాలే!

ఇక మొన్న ఈ సినిమా నుంచి వచ్చిన చిరంజీవి- రవితేజ కలిసి డాన్స్ చేసిన ‘మెగా పూనకాలు’ సాంగ్ కూడా భారీ స్థాయిలో అభిమానులకు అంచనాలు పెంచేసింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి నా తమ్ముడు పవన్ కు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదని కూడా ఆయన చెప్పుకొచ్చాడు’.

Chiranjeevi COVID-19 | Pawan Kalyan wishes South superstar Chiranjeevi a  quick recovery from COVID-19

‘ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి పూనుకున్నాడు. కానీ కొంతమంది మాత్రం పవను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు’. ‘పవన్ పై విమర్శలు వింటున్నప్పుడు నాకు ఎంతో బాధ కలుగుతుందని, నా తమ్ముడు పవన్ ను విమర్శించిన వారితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నాకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుందని చిరంజీవి చెప్పుకొచ్చాడు’.

Pawan Is A Fireball: Chiru Wishes On Birthday

‘పవన్ కళ్యాణ్ ను నేను ఓ బిడ్డలా భావిస్తానని నా కుటుంబం పై అతనికి ఎంతో ప్రేమ అని చిరంజీవి చెప్పుకొచ్చాడు’. ఇక మరో వైపు బాలకృష్ణ వీర సింహారెడ్డి కూడా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా 24 గంటల వ్యవధిలో రిలీజ్ అవుతున్నాయి, ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఈ రెండు సినిమాలు మ‌ధ్య‌ ఎలాంటి ఫైట్ ఉంటుందో అని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.