ఫైనల్లీ..ఎట్టకేలకు ఆ పని చేసిన పూజా హెగ్డే.. ఇక ఆల్ హ్యాపీస్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో అల్లాడిపోతుందో మనందరికీ తెలిసిందే. గత ఏడాది ఆమె నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి మరి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా స్టార్ హీరోస్ తో జత కట్టిన పూజా రాత మారకపోవడంతో జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

పూజ హెగ్డే కెరియర్ ప్రజెంట్ కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతుంది. ఎలాగైనా సరే ఆమె సల్మాన్ ఖాన్ తో చేస్తున్న హిందీ ప్రాజెక్ట్ హిట్ అయితేనే పూజ హెగ్డే పేరు మళ్లీ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ఈ సినిమా కానీ ఫ్లాప్ అయితే పూజ ఇక కెరియర్ కి గుడ్ బాయ్ చెప్పేయొచ్చు అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్న ఇలాంటి క్రమంలోనే మొత్తం భారాన్ని దేవుడిపై వేసేసింది పూజా హెగ్డే .

రీసెంట్గా పూజా హెగ్డే హైదరాబాద్ లోని ఫేమస్ టెంపుల్ పెద్దమ్మతల్లి గుడి కి వెళ్ళింది . డస్కి బ్యూటీ పూజ హెగ్డే ఆదివారం పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించింది . అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కాసేపు అమ్మవారి సన్నిధిలో హల్చల్ చేసింది పూజ హెగ్డే . ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వైట్ కలర్ కుర్తాలో చాలా ట్రెడిషనల్ గా ..అట్రాక్టివ్ లుక్ లో ఆకట్టుకునింది పూజ హెగ్డే. ఇన్నాళ్లు పబ్బులు , పార్టీలు అంటూ తిరిగిన పూజా హెగ్డే .. సడన్గా ఇలా దైవ దర్శనం చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)