“వాల్తేరు వీరయ్య” ఫ్లాప్ అవుతుందని శృతిహాసన్ కి ముందే తెలుసా..? అయినా చిరు తో రొమాన్స్ కారణం ఇదే..!!

ఎప్పుడు లేని విధంగా ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది అన్న సంగతి అందరికీ తెలిసిందే . చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్ లెజెండ్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి – నందమూరి నటసింహం బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధ వాతావరణం కి సై అన్నారు. జనవరి 12వ తేదీన నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటల తరువాత మెగాస్టార్ చిరంజీవి ఎన్నో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మెగా వ్స్ నందమూరి ఫైట్ పీక్స్ లో ఉంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ ఆధారంగా నందమూరి బాలయ్య వీర సింహారెడ్డి సినిమాని హైయెస్ట్ రివ్యూస్ పాజిటివ్గా అందుకుంది . వాల్తేరు వీరయ్య ఎక్కువగా ట్రోలింగ్స్ కి గురవుతుంది. కాగా ఈ రెండు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది శృతిహాసన్ నే కావటం గమనార్హం. ఈ స్టార్ డాటర్ ముందుగా సైన్ చేసిన సినిమా వీరసింహారెడ్డి ..ఆ తరువాత బాబి వాల్తేరు వీరయ్య కోసం శృతిహాసన్ ను అప్రోచ్ అయ్యాడట .

అయితే కథ విన్న తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా కన్నా వీరసింహారెడ్డి సినిమా నే బాగుంది అన్న ఫీలింగ్ శృతిహాసన్ కి అనిపించిందట . అంతేకాదు వాల్తేరు వీరయ్య సినిమా చేస్తే ఆమెకు నెగటివ్ రివ్యూస్ వస్తాయని కూడా తెలుసట. కానీ ఆమె చిరు తో రొమాన్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఆమె ఎప్పటినుంచో చిరుకి బిగ్ ఫ్యాన్ ..ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్నది ఆమె కల ..ఆ కారణంగానే చిరంజీవి సినిమా అవకాసం రాగానే యాక్సెప్ట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్త వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే శృతిహాసన్ ఈ సంక్రాంతికి ఒక హిట్ట అయితే ఖచ్చితంగా తన ఖాతాలో పడేలా చేసుకుంటుంది అంటూ ముందుగానే కంగ్రాట్స్ చెప్తున్నారు ఆమె అభిమానులు.