సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు తమ వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. దీనికి కారణం వారు సినీ కెరియర్లో వివాహం అన్న పేరిట డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది ఇప్పటికే వివాహం చేసుకోకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే వారిలో మరికొంతమంది వివాహం చేసుకొని పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఎంత కట్న కానుకలు తీసుకున్నారు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.
రామ్ చరణ్ – ఉపాసన :చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ 2012లో ఉపాసనను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో రామ్ చరణ్ కి ఉపాసన కుటుంబ సభ్యులు కట్నం కింద రూ. 300 కోట్లకు పైగా ఆస్తులు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు అపోలో హాస్పిటల్స్ లో ఉపాసన భర్తగా ఈమెకు వాటాలు కూడా కల్పించారు.
మహేష్ బాబు – నమ్రత:వంశీ సినిమా ద్వారా ప్రేమలో పడ్డ వీరిద్దరూ ఆ తర్వాత వివాహం చేసుకొని ఒకటయ్యారు . ఆ సమయంలో మహేష్ బాబుకు నమ్రతా కుటుంబ సభ్యులు రూ.75 కోట్లకు పైగా ఆస్తులు ఇచ్చినట్లు సమాచారం.
అల్లు స్నేహారెడ్డి – అల్లు అర్జున్:ఈ జంట కూడా ప్రేమ వివాహమే చేసుకుంది . 2011లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక కూడుకు ,ఒక కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే . ఇకపోతే అల్లు అర్జున్.. స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నప్పుడు స్నేహ రెడ్డి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ కు రూ. 100 కోట్లకు పైగా కట్నం ఇచ్చారు.
ఎన్టీఆర్ – ప్రణతి:నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ 2011లో ప్రణతిని వివాహం చేసుకున్నారు. అయితే ప్రణతి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కి రూ. 200 కోట్ల వరకు ఆస్తులు ఇచ్చినట్లు సమాచారం . ఇప్పుడు వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.