కాస్త గ్యాప్ తీసుకొని విదేశాలకు వెళ్ళబోతున్న మెగాస్టార్… ఎందుకంటే?

మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగునాట ఆయనకున్న క్రేజ్ మరే హీరోకి లేదంటే మీరు నమ్ముతారా? రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ము దులిపేసారు. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే మెగా ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఎంజాయ్ చేయలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు “వాల్తేరు వీరయ్య” సినిమాపైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెగాస్టార్ నటిస్తున్న ఫుల్ మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇటీవలే విడుదలైన మొదటి సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటకు మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా స్వయంగా లిరిక్స్ రాసి, పాడారు కూడా. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో పూర్తయ్యిందనే విషయం విదితమే.

ఇకపోతే ఈ సినిమాలో కొన్ని సీన్స్ విదేశాల్లో చిత్రీక‌రించాల్సి ఉండగా ఎంటైర్ యూనిట్ ఫ్రాన్స్‌కు వెళుతున్నార‌ని స‌మాచారం. చిరంజీవితో స‌హా యూనిట్ స‌భ్యులు అంతా ఫ్రాన్స్ బయలుదేరారు. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వారంలోనే మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్యను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ అనే సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించనున్నారు.