సినిమా స్టార్ లు తమ నటనలోనే కాకుండా ఛాన్స్ దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడి తమ టాలెంట్ ని చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే ప్రతి సంవత్సరం సిసిఎల్ పేరుతో సినిమా పరిశ్రమలో ఉన్న స్టార్ లు అందరూ క్రికెట్ ఆడుతూ ఉంటున్నారు. వీరిలో యువ హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా అప్పుడప్పుడు తమ టాలెంట్ ని చూపిస్తూ అభిమానులని అలరిస్తూ ఉంటారు. అయితే వీరు క్రికెట్ ఆడి ఆ వచ్చిన డబ్బులను చారిటీలకు వినియోగిస్తూ ఉంటారు. గతంలో సీనియర్ హీరోస్ యువ హీరోలు అనే సంబధం లేకుడా క్రికెట్ ఆడేవరు.
ప్రజెంట్ యంగ్ హీరోలు మత్రమే ఆడుతున్నరు. మొన్నటి వరకు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ కూడా క్రికెట్ ఆడి తమ టాలెంట్ ని చూపించారు. అయితే వీళ్లు కాకుండా అలనాటి సీనియర్ హీరోలైన ఎన్టీఆర్- ఏఎన్ఆర్ వంటి దిగ్గజ నటులు కూడా బ్యాట్ పట్టుకుని మైదానంలో క్రికెట్ ఆడారు. ఈ సీనియర్ హీరోలు బాలీవుడ్ స్టార్ట్స్ మీద మన సీనియర్ హీరోలు క్రికెట్ ఆడారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రికెట్ మ్యాచ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ హీరోలపై బాలీవుడ్ హీరోలు తలపడ్డారు. అప్పట్లో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా కలిసి ఆడటం విశేషం. టాలీవుడ్ టీమ్ తరుపున ఎన్టీఆర్- ఏఎన్ఆర్ తో పాటుగా కృష్ణంరాజు,జయప్రద , రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్య , రాజబాబు, ప్రభాకర్ రెడ్డి , వంటి దిగ్గజ నటలు పాల్గొన్నారు. బాలీవుడ్ టీమ్ తరఫున అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్ లతో పాటు ఇంకో కొంతమంది నటులు ఉన్నారు.
1978లో ఓ చారిటీ కోసం ఏర్పాటు చేసిన ఈ మ్యాచ్.. ఎల్బీ స్టేడియంలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ కు సంబంధించిన వీడియో ని సీనియర్ హీరో మురళీమోహన్ నటించిన ఓ సినిమాలో కూడా చూపించారు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కరలు కొడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.