చిరంజీవిని దూరం పెడుతున్న అల్లు అరవింద్.. కారణం అదేనా..!

టాలీవుడ్ అగ్ర హీరోలు ఒకరైన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఆయన నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ లో 10 మందికి పైకి హీరోలు వచ్చారు. వారిలో ప్రధానంగా మనం రామ్ చరణ్- పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో అగ్ర హీరోలు కొనసాగుతున్నారు.

Chiranjeevi celebrates birthday with family and fans, Allu Arjun misses the  bash | Regional Indian Cinema

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే ఒకప్పుడు ఇండస్ట్రీ షేక్ అయిపోయేది.. ఆయన సినిమా వస్తుందంటేనే ఆయన అభిమానులకు పండగలాగ ఉండేది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన దగ్గరనుంచి ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయి. ఆయన ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చాడు.. ఆయన ఆ సినిమా తర్వాత నటించిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి. అయ‌న‌ నటించిన సినిమాలలో తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్నీ ఆయన రేంజ్ హిట్ ఇవ్వలేక పోతున్నాయి.

ఆయన రాజకీయాలలోకి వెళ్లి అక్కడ సక్సెస్ అవ్వకపోవడంతో మళ్ళీ తిరిగి సినిమాలలో బిజీ అవుతున్నారు. ఒకప్పుడు చిరంజీవితో ఎంతో సన్నిహితంగా ఉండే అల్లు అరవింద్ కూడా ఇప్పుడు చిరంజీవికి దూరం అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ మధ్యన టాలీవుడ్ లో జ‌రిగిన‌ కొన్ని అనుకోని సంఘటనల వల్ల చిరంజీవి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్ రెడ్డిని కలవడం. అలా జగన్ ని మీట్ అయ్యి వచ్చిన దగ్గర నుంచి చిరంజీవిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ ట్రోలింగ్ ఎవరు చేస్తున్నారు.. ఆ ట్రోల్లింగ్ చేసే వారి వెనక ఏ రాజకీయ పార్టీ ఉందో ఎవరికి అర్థం కావట్లేదు.

Talk of the Town: Differences between Chiranjeevi & Allu Aravind?

అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్ పామ్ ఆహాలో నందమూరి బాలకృష్ణ తో చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ఏ రేంజ్ లో భారీ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ షో రెండో సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఈ సీజన్ లో ఓ ఎపిసోడ్ కి చిరంజీవిని గెష్ట్‌గా పిలుద్దామంటే బాలయ్య వద్దని చెప్పారని తెలుస్తుంది. బాలయ్యకు చిరంజీవి మధ్య కొంత గ్యాప్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆహాలు వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ అల్లుఅరవింద్‌ పర్మిషన్ తోనే జరుగుతాయి. అలాంటిది చిరంజీవిని పక్కన పెట్టడం వెనుక అల్లు అరవింద్ హస్తం కూడా ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ షో కి పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తాడని తెలుస్తుంది. దీంతో చిరంజీవి నా అనుకున్న వాళ్లకు దూరం అయిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!