తెలుగు చిత్ర పరిశ్రమల విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తన మొదటి సినిమా గులాబీ నుండి ఇటీవల రిలీజైన నక్షత్రం సినిమా వరకు క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఆడియన్స్ లో క్రియేట్ చేసుకోగలిగాడు. కృష్ణవంశీ సినిమా చేస్తున్నారంటే ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.
సింధూరం- అంతపురం- మురారి- చక్రం- ఖడ్గం- రాఖీ- చందమామ- మహాత్మా -మొగుడు- గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు చేశాడు. ఆయన ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే చేశారు. ఆయన సీనియర్ హీరోలలో నాగార్జునతో రెండు సినిమాలు చేశారు. అందులో నిన్నేపెళ్లాడతా సినిమా సూపర్ హిట్ అవ్వగా చంద్రలేఖ సినిమా యావరేజ్ అయ్యింది. కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ అనే సినిమా చేస్తున్నారు.
ఈ మూవీ గురించి ఈటీవీ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు వెల్లడించారు.. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన తన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలానే తన కెరియర్లో చేసిన సినిమాలు, హీరోల గురించి కూడా మాట్లాడారు. డైరెక్టర్ రాసుకున్న పాత్రని పెర్ఫార్మెన్స్ పరంగా కళ్ళకి కట్టినట్టు తెరపై చూపించే వారిలో ప్రధానంగా ఈ తరం కుర్ర హీరోలలో ఎన్టీఆర్ – మహేష్ బాబు ఉంటారని కృష్ణవంశీ అన్నారు.
మహేష్ బాబు- ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరికి నేను కనిపించినా మంచి కథ ఉంటే చెప్పండి… మనం సినిమా చేద్దామని అడుగుతుంటారని కృష్ణవంశీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ తరం హీరోలలో నాకు ఎన్టీఆర్ – మహేష్ బాబు అంటేనే ఇష్టమని కృష్ణవంశీ చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.