స‌మంత‌లా నేను చేయ‌ను.. ఆ మ్యాట‌ర్‌పై ర‌ష్మిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్‌గా మారింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో న‌టిస్తున్న ఈ సుందరి.. ప్ర‌స్తుతం `పుష్ప‌` ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ 17న విడుద‌ల‌కు ముస్తాబైంది.

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో మూవీ మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌ష్మిక‌.. సినిమా గురించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ర‌ష్మిక మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను శ్రీవల్లి పాత్రను పోషించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. తెరపై శ్రీవల్లి కాస్త క్యూట్ గా .. మరికాస్త కన్నింగ్ గా కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది.

అలాగే పుష్ప సాంగ్స్‌లో బ‌న్నీ డ్యాన్స్‌ను మ్యాచ్ చేసేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. ముఖ్యంగా `సామి సామి..` పాట మూమెంట్స్ చాలా కష్టంగా అనిపించాయ‌ని పేర్కొంది. ఇక ఈ సినిమాలో స‌మంత ఐటెం సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంపై స్పందించిన ర‌ష్మిక `సమంత చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ అవుతుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూసి నేను షాక్ అయ్యాను. అయితే ఆమెలా నేను చేయ‌ను. నాకు స్పెష‌ల్ సాంగ్స్ చేసే ఆలోచ‌నే లేదు` అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ర‌ష్మిక కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారియి.