ఓటీటీలో బిగ్‌బాస్.. ఇక ఎంట‌ర్‌టైన్మెంట్ మామూలుగా ఉండ‌దు!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సీజ‌న్ 5 అయిపోయింద‌ని ఫీల్ అవుతున్న బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌కు కింగ్ నాగార్జున తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలియ‌జేశారు. ఇంత‌కీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. బిగ్‌బాస్ షో త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో 24X7 ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంద‌ట‌.

ఈ విషయాన్ని తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ యాజమాన్యంతో పాటు కింగ్ నాగార్జున ప్రకటించారు. శుక్రవారం ఉదయం హాట్‌స్టార్ వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగ్ ఓటీటీ బిగ్‌బాస్ గురించి అఫీషియల్ గా ప్ర‌క‌టించారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యం ఇటీవ‌ల‌ నావద్దకు వచ్చి..“బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రారంభించాలనుకుంటున్నాం“అని చెప్పడంతో షాక్‌ అయ్యాను.

చివరికి వాళ్లు న‌న్ను ఒప్పించారు. బిగ్‌బాస్‌కి పూర్తి విభిన్నంగా ఈ షో ఉంటుంది. సుమారు 6 కోట్ల మంది బిగ్‌బాస్‌ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్‌బాస్‌ షోలన్నింటిలో మన తెలుగు షోనే సూపర్‌హిట్‌. త్వరలోనే ఓటీటీలోనూ బిగ్‌బాస్ ప్రారంభం కానుంది` అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.

ఇక ప్ర‌స్తుతం షో ఎలా ఉండాలి? ఎంతమంది కంటెస్టెంట్స్‌? ఎన్ని రోజులు? మిగిలిన విషయాలన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక వచ్చే నెలలో ప్రకటిస్తామ‌ని నాగార్జున ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. దీంతో బిగ్‌బాస్ ప్రియులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, హిందీలో ఇప్పటికే ఓటిటి బిగ్ బాస్ ప్రసారమై ఘ‌న విజ‌యం సాధించింది. మ‌రి తెలుగులో బిగ్ బాస్ ఓటిటి ఫార్మాట్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.