యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి సినీ సెలబ్రెటీలుగా మారిన వారు టాలీవుడ్లో ఎందరో ఉన్నారు. అలాగే స్టార్ హీరోలుగా సత్తా చాటుతూ యాంకర్స్గా మారిన వారూ ఉన్నారు. అలాంటి హీరోలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ తొలి సారి యాంకర్గా మారి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.
నాగార్జున: `మీలో ఎవరు కోటీశ్వరుడు` షోతో యాంకర్గా మారిన నాగ్.. ప్రస్తుతం బిగ్ బాస్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.
రానా దగ్గుబాటి: `నెంబర్ వన్ యారీ` షోతో హోస్ట్గా మారిన రానా.. తనదైన యాంకరింగ్తో బుల్లితెర ప్రేక్షకులను బాగానే రంజింపచేశారు.
మెగాస్టార్ చిరంజీవి: `మీలో ఎవరు కోటీశ్వరుడు` షోతే చిరంజీవి కూడా హోస్ట్గా మారారు.
జగపతిబాబు: సీనియర్ హీరో జగపతిబాబు తొలి సారి హోస్ట్గా చేసిన షో `కో అంటే కోటి`.
సాయికుమార్: విలక్షణ నటుడు సాయి కుమర్ వావ్, మనం వంటి షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.
నాని: న్యాచురల్ స్టార్ నాని సైతం `బిగ్ బాస్` షోతోనే హోస్ట్గా మారాడు. ఈయన బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్గా వ్యవహరించాడు.
బాలకృష్ణ: ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహలో ప్రసారం కాబోయే `అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే`తో హోస్ట్గా మారారు. ఈ షో త్వరలోనే ప్రసారం కాబోతోంది.