ఎన్టీఆర్ షో లో గెలిచిన డబ్బును సమంతా ఏం చేసిందో తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ సమంత ఇటీవలే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. విడాకులు తీసుకున్న అనంతరం సమంతదే తప్పు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇక తాజాగా సమంత ఒక షో లో పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హౌస్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి గెస్ట్ గా వెళ్లిన సమంత అక్కడ ఎన్టీఆర్ తో తన బాధలు అనుభవాలు పంచుకుందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ షోలో పాల్గొని సమంతకు వచ్చిన డబ్బులు అన్నీ తన స్వచ్ఛంద సంస్థ అయిన ప్రత్యూష ఫౌండేషన్ కు అందించినట్లు తెలుస్తోంది.

ఇన్ని బాధల్లో కూడా సమంతా తన సేవ దృక్పదాన్ని కొనసాగిస్తుండటం అభిమానించి దగ్గ విషయమే.ఈ మధ్య కాలంలో విడాకుల అంశం నుంచి కోలుకోక ముందే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు సమంత అభిమానులు. నీ సేవ కు సలామ్ అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఆమెను పొగుడుతున్నారు. తన పౌండేషన్ పేరిట స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసి ఎవరికో చేయూతను అందిస్తున్నారు.