లవ్ స్టోరీ సినిమాతో మహేష్ బాబుకు లాభాల పంట?

నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా విడుదల అయ్యి నెల అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్ లో ఆడుతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన అది పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. దీనితో ఈ లవ్ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను శేఖర్ తమ్ముడు దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. విడుదలైన తొలి రోజె ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్ళు ను రాబట్టింది.

కరోనా సెకండ్ వేవ్ తరువాత విడుదలైన సినిమాలలో అత్యధికంగా వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటికి ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ఆహా లో విడుదల అవుతున్నప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్ లో చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇది ఇలా ఉంటే లవ్ స్టోరీ సినిమా ఒకటి థియేటర్ కు ఏకంగా కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇంతకీ ఆ థియేటర్ ఏదో కాదు మన సూపర్ స్టార్ మహేష్ బాబు కు చెందిన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్.కరోనా సెకండ్ వేవ్ తరువాత ఈ మల్టీప్లెక్స్ లో కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి సినిమాగా లవ్ స్టోరీ నిలిచిందట. ఇప్పటివరకు ఈ థియేటర్ లో 251 నిర్వహించగా 48 వేల 233 మంది వీక్షించారు. స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ కలెక్షన్లు సాయి పల్లవి నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా రావడం విశేషం.