కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోవడమే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా దక్కించుకుంది.
ఇక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీర్తి.. ప్రస్తుతం ఇద్దరు బిగ్ స్టార్స్కు చెల్లి గా నటిస్తోంది. వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్(అన్నాత్తే) ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి(భోళా శంకర్). అయితే ఇప్పుడీ ఈ విషయమే కీర్తి అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
హీరోయిన్గా దూసుకుపోతున్న తరుణంలో ఇలా చెల్లెలు క్యారెక్టర్ చేయడం కీర్తి హార్డ్ కోర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా చిరు భోళా శంకర్..తమిళ వేదాలం సినిమాకు రిమేక్ కావడం.. ఆ సినిమాను అన్నాత్తే డైరెక్టర్ శివనే డైరెక్టర్ చేయడంతో… ఈ రోల్స్ రెండూ ఇంచు మించు ఒకేలా ఉంటాయని చాలా మంది భావిస్తున్నారు. అందువల్లనే ఇలా ఓకే టైపు క్యారెక్టర్స్ చేస్తే.. కెరీర్ గాడి తప్పే ప్రమాదం ఉంటుందని ఆమె ఫ్యాన్స్ భయపడుతున్నారు.