ఏపీలో లో వైయస్ రాజశేఖర్రెడ్డి కొడుకుగా ఎలక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.2019 వ సంవత్సరం లో అత్యధిక మెజార్టీతో సీఎం పదవిని కైవసం చేసుకున్నాడు.ఇక ఆ పార్టీకి వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు గా ఉండేది.ఇక ఇప్పుడు ఆమె ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎక్కువగా సమాచారం వినిపిస్తోంది. ఈమె సెప్టెంబర్-2వ తేదీన వైయస్ జగన్ విశ్వాసాన్ని కదిలించేలా ఉన్నది అన్నట్లుగా వినిపిస్తున్నాయి.
ఇక ఈమె తన కూతురు షర్మిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కొన్ని వర్గాలు చెబుతున్నాయి.ఇక తెలంగాణలో కూడా ఆమె తన కూతురికి సపోర్టుతో నిర్మిస్తున్నట్లు సమాచారం.ఇక తెలంగాణలో షర్మిలను తెలంగాణ కోడలుగా అంగీకరించవచ్చునీ అక్కడి ఎమ్మెల్యే ఎంపీలు తెలియజేస్తున్నారు.ఇక తన తల్లి విజయలక్ష్మి పులివెందుల కోడలు అని ప్రతి ఒక్కరికి తెలుసు.
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం అప్పుడు ఈమె చేతిలో ఎప్పుడూ బైబిలు ఉండడంవల్ల ప్రతిపక్షాలు ఆమెపై మతోన్మాది గా ముద్ర వేశారు.అలా 2014 ఎన్నికల్లో చెప్పి టిడిపి గెలిచింది ఇక 2019 సంవత్సరంలో మాత్రం సజావుగా ఇలాంటి పనులు ఏమి చేయకుండా తమ పార్టీకి సంబంధించి నటువంటి కొన్ని విషయాలను తెలియజేస్తూ ప్రచారం చేయసాగారు దీంతో ఘన విజయాన్ని అందుకున్నారు వైఎస్ఆర్ పార్టీ సభ్యులు. ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ వైపు కూడా తన కూతురు షర్మిల ఒక పార్టీ ని స్థాపించింది.
ఇక తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలలో వైయస్ కు అనుకూలంగా ఉన్న వారందరితో సెప్టెంబర్ 2వ తేదీన విజయమ్మ వైయస్ కు నివాళులు అర్పించాలని విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అందులో వైయస్ కి అతీతంగా ఉన్న కొంతమంది ఎంపీ ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు పంపించింది.అయితే ఈ క్రమంలో ఆ కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అన్నట్లుగా తర్జనభర్జన పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని వైసిపి నాయకులు, తెలంగాణలోని కొంతమంది నాయకులు.
ఒకవేళ వెళ్లకపోతే వైయస్సార్ పెట్టిన రాజకీయ భిక్ష ఎదిగి ఇప్పుడు ఆయన కార్యక్రమానికి పిలిస్తే రాలేదని ప్రచారం ఎక్కువగా జరుగుతుందని కొంతమంది ఆలోచిస్తున్నారు.ఇక టిఆర్ఎస్ లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది అక్కడి సభకు వెళ్లి ఏం చెప్పాలి? అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అక్కడ కొంత మంది టిఆర్ఎస్ నేతలు.ఇక ఇప్పటివరకు టిఆర్ఎస్ లో వైయస్సార్ ను ద్రోహిగా నిలుచున్నాడు.ఒకవేళ వారు పంపించిన ఆహ్వానాన్ని ఓకే చేసి వెళితే అక్కడ రాజశేఖర్ ని పొగడాలి వస్తుంది.
అలా పొగిడితే కేసీఆర్ ప్రజల్లో చులకన అవుతారు. వెళ్లకపోతే రేపు మీడియా ముందు విజయమ్మ వచ్చి వారిని దోషులుగా చిత్రీకరించే ప్రమాదముంది.అయితే టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తారు ఏం జరుగుతుందో చూడాలి.