గత కొద్ది రోజుల నుంచి నాగచౌతన్య, సమంత వార్తల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం.. వీరి విడాకుల వ్యవహారమే. సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్లో ఒకరైన చైతు-సామ్లు డివోర్స్ తీసుకోబోతున్నారన్న ప్రచారం బయటకు రావడంతో.. వీరిద్దరిపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.
ప్రధాన మీడియా సైతం వారిద్దరిపైనే ఫొకస్ పెట్టేసింది. దాంతో ఎక్కడ చూసినా వీరిద్దరికి సంబంధించిన వార్తలే దర్శనమిచ్చేవి. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చైతు-సామ్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చేశాడు. `రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ ఏపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రులను సన్నాసులు, వెధవలు అంటూ రెచ్చిపోయాడు.
చిరంజీవి, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, దిల్ రాజు వంటి సినీ ప్రముఖులను సైతం మధ్యలోకి చెడుగుడు ఆడేశాడు పవన్. ఇంకేముంది పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఫలితంగా చైతు-సామ్ల విడాకులు న్యూస్ మరుగున పడిపోయింది. గత నెల రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్న వీరి విడాకులు వ్యవహారం రెండు రోజులుగా తెరపైకి రావడం తగ్గిపోయింది. దాంతో పవన్ పరోక్షంగా నాగ చైతన్య, సమంతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్టైంది.