పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ఆగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. విలన్గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్పాల్ కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొత్త షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే నేడు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 29, 2022న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ను రివిల్ చేశారు.
కాగా, పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇతర భాషలలో ఒకేసారి విడుదల కానుంది. దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రం పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రమని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు.