`పుష్ప‌` నుంచి బ్రేక్ తీసుకుని మ‌రీ దుబాయ్ వెళ్లిన బ‌న్నీ..కార‌ణం అదే!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.

Image

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని మ‌రీ బ‌న్నీ దుబామ్ వెళ్లారు. కరోనా వ‌ల‌న పెద్ద‌గా టూర్స్ వేయ‌లేక‌పోయిన బ‌న్నీ.. టైట్‌ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో దుబాయ్ చెక్కేశార‌ట‌.

Image

ప్ర‌స్తుతం అక్క‌డ భార్య‌, పిల్ల‌ల‌తో బ‌న్నీ వేకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ పిక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ పిక్‌లో స్టైలిష్‌ స్టార్‌ టోటల్‌ బ్లాక్‌ డ్రెస్‌లో ఉండగా, వెనుక చీకట్లో మెరుస్తున్న దుబాయ్‌ సిటీ ఆకట్టుకుంటోంది.