మరొకసారి ప్రభాస్ సినిమాలో సత్యరాజ్..?

ప్రభాస్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా రాణించిన సత్యరాజ్ తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా నటించారు. కానీ ఆయనకు “మిర్చి” సినిమాతోనే బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన సత్యరాజ్ కు మంచి మార్కులే పడ్డాయి. “బాహుబలి” చిత్రంలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ కనబర్చిన నటనా ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు.

ఐతే సత్య రాజ్ మరొక సారి ప్రభాస్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న “రాధేశ్యామ్” చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ కడప జిల్లాలోని గండికోట సమీపంలో జరుగుతోంది. కాగా కడప జిల్లాకు చేరుకున్న సత్యరాజ్ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.