రాధేశ్యామ్ నుండి కూడా రాబోతుందట!

యంగ్ రెబల్ స్టా్ర్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు షూటింగ్‌లు జరుపుకుంటున్నా, ఒక్క సినిమా కూడా రిలీజ్ మాత్రం కావడం లేదు. దీనికి కరోనా కారణంగా చూపిస్తు్న్నారు ఆయా చిత్ర యూనిట్ సభ్యులు. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం ఎప్పుడో పూర్తయి ఈపాటికి రిలీజ్ కూడా కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, అటుపై కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్‌పై జనాల్లో ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది.

కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఓ చిన్న గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేసి ఈ సినిమాపై ఉన్న బజ్‌ను తగ్గేలా చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇంకా ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని, రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ అంటోంది. కాగా సెప్టెంబర్ నెలలో ఈ సినిమా నుండి అదిరిపోయే అప్‌డేట్ రాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

వింటేజ్ లవ్ స్టోరీగా రాధేశ్యామ్ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ అద్భుతంగా తీర్చిదిద్దాడని, ఈ సినిమాలో రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లడం ఖాయమని వారు అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా, పూర్వజన్మల నేపథ్యంలో రాబోతున్న రాధేశ్యామ్ నుండి ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయో తెలియాలంటే సెప్టెంబర్ నెల వరకు వెయిట్ చేయాల్సిందే.