పీవీ సింధుకి చిరు సత్కారం..అడ్డంగా దొరికిపోయిన రాధిక!

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ స‌న్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు.

Image

ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప‌లు ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోను అంద‌రితోనూ పంచుకుంటూ రాధిక చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది. `పీవీ సింధు పసిడి పతకం గెలుచుకోవడం ఎంత గొప్ప అనుభూతి! దేశం కోసం పోరాడి పతకం సాధించింది` అంటూ రాధిక తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఒలింపిక్ గోల్డ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.

Image

అయితే నిజానికి పీవీ సింధు కాంస్యం గెలుచుకుంది. దాంతో నెటిజన్లు రాధిక అడ్డంగా దొరికిపోయింది. ఇంకేముంది రాధికను ట్రోలర్లు ఆడుకుంటున్నారు. పీవీ సింధు గెలిచిన పతకం ఏంటో కూడా తెలియకుండానే.. ఆమెను అభినందిస్తున్నావా? అంటూ రాధికపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/realradikaa/status/1428747990349451269?s=20