మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇక త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో చరణ్కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ కన్ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి కియారా పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
లేటెస్ట్ టాక్ ప్రకారం.. చరణ్ మూవీకి గానూ కియారా ఏకంగా రూ.4 కోట్లు రెమ్యునరేషన్గా వసూల్ చేస్తోందట. కియారా క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా అంత మొత్తం ఇచ్చేందుకు ఒకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రానికి ఎస్ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించనున్నారు.