బాలీవుడ్ భామ కాజోల్పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన పనికి పొగరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కాజోల్ బుధవారం 47వ పుట్టినరోజు జరుపుకుంది. కరోనా కారణంగా చాలా సింపుల్గా కాజోల్ బర్త్డే వేడుకలు జరిగాయి.
అయితే కాజోల్ బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని ముగ్గురు పిల్లలతో ఎంతో ఆశగా కేక్తో జుహూలోని ఆమె ఇంటికి చేరుకున్నారు. తాము తెచ్చిన కేక్ను కాజోల్తో కట్ చేయించాలని తపించారు. ఇది తెలుసుకున్న కాజోల్ వారిని డోరు దగ్గరే నిలబెట్టి… వారు తెచ్చిన కేక్ కట్ చేసింది. అయితే కాజోల్ ఆ కేక్ను తినలేదు.
కనీసం ఆ పిల్లలకు కూడా తినిపించకుండా, వారికి దూరంగానే నిల్చొని ఒక ఫొటో దిగి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావాడంతో నెటిజన్లు.. కాజోల్ ఇలా చేస్తుందని అనుకోలేదని, ఆమెకి చాలా పొగరని విమర్శలు గుప్పిస్తున్నారు.