టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ బన్నీ పోస్ట్ ఏంటీ..? అసలు ఆయన ఎందుకు ఎమోషనల్ అయ్యారు..? అన్న విషయాలు తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. బన్నీ గారాల పట్టి అర్హ.. బాలనటిగా `శాకుంతలం` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలో అర్హ భరతుడిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో జరుగుతుంది. అర్హ కూడా షూటింగ్లో పాల్గొంటోంది. అయితే శాకుంతలం షూటింగ్ జరుగుతున్న స్టూడియోస్లోనే పుష్ప షూట్ కూడా జరుగుతోంది.
అంటే ఒకే లొకేషన్లో ఇటు తండ్రీ, అటు కూతురు వేరు వేరు చిత్రాల్లో నటిస్తున్నారన్నమాట. ఇక తన కూతురు నటిస్తున్న సినిమా.. తన సినిమా షూటింగ్ ఒకే చోట జరుగుతుండటంతో ఫుల్ ఎగ్జైట్ అయిపోయిన బన్నీ.. `అర్హ, నేను ఒకే లొకేషన్లో వేరు వేరు చిత్రాల్లో నటిస్తున్నాం. ఇలాంటి రోజు ఓ 15-20 ఏళ్ల తర్వాత ఉంటుందనుకున్నా. కానీ ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. పుష్పరాజ్ భరతుడిని కలిశాడు. ఇది ఎప్పటికి గుర్తిండిపోతుంది` అంటూ లొకేషన్లో అర్హతో దిగిన పిక్ను షేర్ చేశాడు. దాంతో బన్నీ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.
https://twitter.com/alluarjun/status/1424683130053558277?s=20