శంక‌ర్‌-చ‌ర‌ణ్ సినిమాపై న్యూ అప్డేట్‌!?

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాని ప్ర‌కారం.. సెప్టెంబర్‌లో మొదటివారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించి అక్టోబర్‌లో సెట్స్‌మీదకు తీసుకువెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది.

అంతేకాదు, ఆరు నెలల్లోనే షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేయాలని టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నార‌ట‌. కాగా, ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా తెరకెక్క‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ని టాక్‌.