వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ను కూడా ప్రారంభించారు.
ఈ రెండు చిత్రాలు కొంత షూటింగ్ను కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంతలో కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. ఈ మూవీ షూటింగ్స్కు బ్రేక్ పడ్డాయి. అయితే వాస్తవానికి ఈ రెండు చిత్రాల్లో మొదట హరిహరవీరమల్లును పవన్ పూర్తి చేయాల్సి ఉంది. కానీ, తాజాగా పవన్ ప్లాన్ను మార్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముందు ఏకే రీమేక్ షూటింగ్ను పూర్తి చేసేసి విడుదల చేయాలని, ఆ తర్వాత హరిహరవీరమల్లును రిలీజ్ చేస్తే బావుంటుందని పవన్ భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే క్రిష్తో పవన్ చర్చలు జరపగా.. ఆయన వెనక్కి తగ్గి ఒకే చెప్పినట్టు టాక్ నడుస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి హరిహరవీరమల్లు విడుదల అవుతుందని ఇప్పటికే నిర్మాతలు తెలిపారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. ఆ స్థానంలో ఏకే రీమేక్ను విడుదల చేయనున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.