టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారమే స్టార్ట్ అయింది.
రామ్, కృతి శెట్టితో పాటుగా తదితరులు షూటింగ్లో పాల్గొన్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందనున్న ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ చిత్రంలో విలన్గా కోలీవుడ్ హీరో ఆర్య కనిపించనున్నాడట. లింగుస్వామి ఇప్పటికే ఆర్యను సంప్రదించగా.. ఆయన ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.