చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమాపై క్రేజీ అప్డేట్‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ ర‌మ్‌చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌నున్నారు.

Dil Raju orchestrating Ram Charan - Shankar project | TeluguBulletin.com

ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చ‌నుండ‌గా..జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మెగా అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

Producer Dil Raju to tie the knot tonight in Nizamabad | Telugu Movie News  - Times of India

ఈ సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్‌లో ప్రారంభం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు పేర్కొన్నారు. ఇక దిల్ రాజు ఇచ్చిన క్రేజీ అప్డేట్‌తో చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.