నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు నిర్మించారు.
అన్ని అనుకున్నట్టు జరిగుంటే ఈ చిత్రం ఏప్రిల్ 16నే విడుదలై ఉండేది. కానీ, తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్ను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ మూవీ రీలిజ్ డేట్కు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.
ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేయాలని, అప్పటి కరోనా పరిస్థితులు చక్కబడతాయని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే కరెక్ట్ డేట్ను కూడా ఫైనల్ చేసి అనౌన్స్ చేయనున్నారట. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాల్సి ఉంది.