సంగీత విద్వాంసుడు మృతి..!

ప్రస్తుతం కరోనాతో ఇండస్ట్రీలో చాలామంది చనిపోతున్నారు. తాజాగా కరోనాతోప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ అయిన దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం నాడు మృతి చెందారు. దేవవ్రత్ చౌదరి వయస్సు 85 సంవత్సరాలు కాగా, ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవ్వటంతో ఆయన ఢిల్లీలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ శుక్రవారం అర్థరాత్రి ఆయనకి గుండెపోటు రావడంతో డెబు చౌదరి చనిపోయారు.

ఈ విషయాన్నీ డెబు చౌదరి కొడుకు ప్రతీక్ చౌదరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దేవవ్రత్ చౌదరి ప్రముఖ విద్వాంసులు పంచూ గోపాల్ దత్తా, సంగీత ఆచార్య ఉస్తాద్ ముష్తాక్ అలీ ఖాన్ వద్ద సంగీతాన్ని నేర్చుకున్నారు. ఇంకో వైపు ఈ ఉదయం కరోనా కారణంగా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, నటుడు మేజర్ బిక్రాంజిత్ కన్వర్‌పాల్ కూడా మృతిచెందారు. పండిట్ కన్వర్‌పాల్ దాదాపుగా 10 చిత్రాలు ఇంకా పలు టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించారు.