తెలంగాణ వెబ్‌సైట్లు 2 రోజులు బంద్..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలు, వెబ్‌సైట్స్ అన్ని కూడా రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి. గవర్నమెంట్ టు సిటిజెన్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ సేవలు జులై 9 రాత్రి 9 గంటల సమయం నుంచి జులై 11 రాత్రి 9 గంటల సమయం వరకు నిలిచిపోనున్నాయని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ వెల్లడించింది. అయితే వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలను పర్యవేక్షిస్తూ.. అవసరమైన సౌకర్యాలు అందించే స్టేట్‌ డేటా సెంటర్‌ లో అడ్వాన్స్డ్ యూపీఎస్‌(అన్‌ ఇంటరప్టబుల్‌ పవర్‌ […]

జల వివాదం: తెలంగాణ నేతలపై మండిపడ్డ జగన్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ జల వివాదం పై పెదవి విప్పారు. గురువారం రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ తెలంగాణ రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. గతంలోనే నీటి కేటాయింపుల విషయంలో ఒప్పందాలు జరిగాయని.. ఆ ఒప్పందాల ప్రకారమే తాము నీళ్లను వినియోగించుకుంటున్నామని.. ఇందులో తాము చేస్తున్న తప్పేంటి? అని తెలంగాణ నేతలను జగన్ సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని […]

తెలంగాణలో డిగ్రీ పరీక్షల వాయిదా….?

తెలంగాణలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థుల నినాదాలతో విద్యాశాఖ మంత్రి నివాసం దద్దరిల్లుతోంది. తెలంగాణ మంత్రి సబితా ఇంటి వద్ద ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్ టీయూ విద్యార్థులు కలిసి ధర్నా నిర్వహిస్తున్నారు. తమ నిరసనను తెలుపుతూ ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి నాయకులు వెంటనే ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. అలాగే ఆ పరీక్షలను ఆన్ లైన్ లోనే పెట్టాలని కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి విద్యార్థి నాయకులతో మాట్లాడారు. ఆ సందర్భంగా విద్యార్థి […]

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఇలా!

రోజు రోజుకు మండిపోతున్న పెట్రోల్ ధ‌ర‌కు సామాన్యలు హ‌డ‌లెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుసరిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు పెంచుకుంటూ పోతుండ‌డంతో.. వాహనం నడపాలంటేనే ప్ర‌జ‌లు వణికిపోతున్నారు. ఇప్ప‌టికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర.. శ‌నివారం మ‌ళ్లీ పెరిగింది. లీటర్ పెట్రోల్ ధరను చమురు కంపెనీలు 35 పైసలు పెంచాయి. అయితే డీజిల్ ధరలను మాత్రం పెంచలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్ రేట్స్ ఇలా ఉన్నాయి.. తాజా పెంపుతో ప్రస్తుతం తెలంగాణ రాజధాని […]

బ్రేకింగ్ : తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేత..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనాను దృష్టిలో పెట్టుకుని క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే రేప‌టితో ముగుస్తుండ‌టంతో కేసీఆర్ అధ్కక్ష‌త‌న భేటీ అయిన కేబినెట్ లాక్‌డౌన్ నిబంద‌న‌ల‌ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేబినెట్‌లో పాల్గొన్న ఎక్కువ మంది మంత్రులు లాక్‌డౌన్ ఎత్తివేయ‌డానికి ఓటేసిన‌ట్టు తెలిసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా క‌రోనా కేసులు కూడా చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌డుతూ ఉన్నాయి. ఇక దేశంలో చాలా రాష్ట్రాల‌తో పోలిస్తే మ‌న తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య త‌క్కువుగా […]

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత..? వాటిపై ఆంక్షలు త‌ప్ప‌నిస‌రి!

సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డిన క‌రోనా వైర‌స్.. గ‌త కొద్ది రోజులుగా నెమ్మ‌దిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా ఉధృతి త‌గ్గుతుండ‌డంతో.. ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఎత్తివేసి.. నైట్ కర్ఫ్యూను విధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ అత్యవసర భేటి […]

ఈటల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం..ఏం జ‌రిగిందంటే?

మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్ మ‌రియు ఆయ‌న బృందం పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఇటీవ‌లె హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల‌.. నిన్న త‌న బృందంతో స‌హా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ‌ కండువా కప్పుకుని బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న […]

నేడు కాషాయ కండువా క‌ప్పుకోనున్న ఈట‌ల‌..ఏర్పాట్లు పూర్తి!

అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్.. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఈట‌ల కాషాయ కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు ఉద‌యం 11 గంటలకు బీజేపీ గూటికి చేరిపోనున్నారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ […]

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతోంది. ఇలాంటి టైమ్‌లో స్టూడెంట్ల‌కు ఇబ్బందులు రాకుండే ఉండేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే టెన్త్‌, ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఎగ్జామ్స్‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎప్ప‌టి నుంచో ఇంట‌ర్‌సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ కూడా ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ ఉంది. ఇందుకోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ రద్దు చేసింది. ఈ రోజు ఇందుకు సంబంధించి తాజా ప్రకటన విడుదల […]